టిడిపి సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
టిడిపి సభ్యులు చెప్పినట్లుగా సభ నడవదని..చర్చకు ఆటంకం కలిగించవద్దని చెప్పిన స్పీకర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. సభ ప్రారంభమైన వెంటనే టిడిపి సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన టిడిపి సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించగా టిడిపి సభ్యులు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు. దీంతో స్పీకర్ కల్పించుకుని ఎస్సీ కమిషన్ బిల్లు చర్చ సందర్భంగా ఆటంకం కలిగించొద్దని చెప్పారు. టిడిపి సభ్యులు చెప్పినట్టు సభ నడదని స్పీకర్ మండిపడ్డారు. దీంతో టిడిపి సభ్యులు కల్పించుకొని ఇది మీ జాగీరు కాదు అని స్పీకర్పై విమర్శలకు దిగారు. వెంటనే స్పీకర్ మాట్లాడుతూ..ఇది ఎవరి జాగీరు కాదు..ప్రజల జాగీరు అని మీరు చెప్పినట్టు ఎవరు వినరని మంచిది..మంచిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/