వరద ప్రాంతాల్లో పర్యటించిన కిమ్
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ శుక్రవారం వరద ప్రభావిత హంగయీ రాష్ట్రంలో పర్యటించారు. వరద నివారణ, సహాయక చర్యలపై అధికారులను అభినందించారు. పంట నష్టంపై అంచనాకు ఆదేశించారు. అధికార మీడియా కేసీఎన్ఏ ఈ వివరాల్ని వెల్లడించింది. ఉత్తర కొరియాలో ఈ నెల తొలివారం నుంచి భారీవానలు కురిసి పలుప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే. కాగా ఇటివల కిమ్ ఆరోగ్యంపై అనేక వార్తలు, వదంతులు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/