దక్షిణాఫ్రికా చివరి శ్వేతజాతి అధ్యక్షుడు క్లెర్క్ కన్నుమూత
జోహెన్స్బర్గ్: దక్షిణాఫ్రికా చివరి శ్వేతజాతి అధ్యక్షుడు అయిన ఎఫ్డబ్ల్యూ డీ క్లెర్క్ (85) కన్నుమూశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కేప్టౌన్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1993లో నెల్సన్ మండేలాతో కలిసి క్లెర్క్ సంయుక్తంగా నోబెల్ బహుమతిని అందుకున్నారు. 1990, ఫిబ్రవరి 2న క్లెర్క్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. 27 ఏండ్ల తర్వాత మండేలాను జైలు నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/