పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రజినీకాంత్ రెండో కూతురు
రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే సౌందర్యకి కుమారుడు వేద్ కృష్ణ(మొదటి భర్తకి జన్మించిన) ఉండగా.. ఇప్పుడు మరో బిడ్డకు తల్లైంది. ఈ బిడ్డ సౌందర్య, విషగన్ వనంగమూడి దంపతుల కుమారుడు.
ఇక ఈ పిల్లాడికి వీర్ రజినీకాంత్ వనంగమూడి
అనే పేరును పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సౌందర్య రజినీకాంత్ తెలియజేస్తూ… సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. `దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్ కృష్ణ తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడికి విషగన్, వేద్, నేను స్వాగతం పలుకుతున్నామనే క్యాప్షన్ ను కూడా ఆమె జతచేశారు.
రజినీకాంత్ చిన్న కుమార్తె అయిన సౌందర్య అశ్వినీ రామ్ కుమార్ అనే ఒక వ్యాపారవేత్తను 2010లో వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరికీ వేద్ కృష్ణ అనే ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఏడేళ్ల కాపురం తర్వాత వివాదాలు రావడంతో వీరిద్దరు వివాహ బంధానికి స్వస్తి పలికారు 2019లో ఆమె విశాగన్ వనంగమూడి అనే మరో వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకున్నారు.
ఆయనకు కూడా ఇది రెండో వివాహమే. అలా వివాహం చేసుకున్న మూడేళ్ల తర్వాత వీరిద్దరూ తమ చిన్నారికి స్వాగతం పలికారు. ఇక రజనీకాంత్ కుమార్తె అయిన సౌందర్య రజినీకాంత్ దర్శకురాలిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె ముందుగా గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసేవారు. రజినీకాంత్ హీరోగా నటించిన పడయప్ప., బాబా, చంద్రముఖి, శివకాశి, మజా, పందెంకోడి వంటి అనేక సినిమాలకు ఆమె గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. అంతేగాక కథానాయకుడు అనే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో కూడా ఆమె కనిపించారు.