బతికున్న తండ్రిని చంపేసి..ఆస్తి కొట్టేయాలని చూసిన కొడుకులు

మాములుగా తండ్రి చనిపోయాక ఆస్తిని పంచుకున్న కొడుకులను చూసాం..కానీ ఇక్కడ మాత్రం ఆస్థి కోసం బ్రతికున్న తండ్రి చనిపోయినట్లు మరణ ధ్రువపత్రాన్ని సృష్టించి ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు కొడుకులు. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే

అవుకు మండలం వేములపాడుకు చెందిన తిమ్మయ్యకు ఇద్దరు భార్యలు.. మెదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. నంద్యాలలో నివాసం ఉంటున్న ఈయన కు వేములపాడులో 5.36 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి ఫై మొదటి భార్య కొడుకులు కన్నేశారు. ఎలాగైనా భూమి దక్కించుకోవాలని చూసిన ఈ ముగ్గురు.. మరణ ధ్రువపత్రాన్ని సంపాదించి.. సబ్‌-రిజిస్టార్‌ కార్యాలయంలో ఆస్తి రిజిస్టర్ చేయించుకున్నారు. తన పొలం తనఖా పెట్టి బ్యాంకు రుణం పొందుతున్నానని.. ఈసీ తీయడంతో అసలు విషయం బయటపడిందని ఆ తండ్రి వాపోయాడు. ఆస్తికి సంబంధించి తన పేరుకు బదులు కుమారుల పేర్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.