నేడు మరోసారి ఈడీ ముందుకు సోనియాగాంధీ

నిన్న రెండో విడత ఆరు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు

sonia-gandhi-to-face-ed-for-3rd-round-of-questioning-today

న్యూఢిల్లీః నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మూడోసారి విచారించనుంది. మూడో విడత విచారణ కోసం నేడు ఈడీ ఎదుట హాజరు కానున్నారు. నిన్న దాదాపు ఆరు గంటలపాటు సోనియాను విచారించిన అధికారులు నేడు కూడా విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.

మరోపక్క, సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ‘సత్యాగ్రహ’ దీక్ష పేరుతో ఆందోళనకు దిగాయి. ప్రతిపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈడీ సమన్లకు వ్యతిరేకంగా నిన్న ఆందోళనకు దిగిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/