దేశంలో 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారు

సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా

Sonia Gandhi
Sonia Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ బిజెపిపై మండిపడ్డారు. కరోనా వైరస్‌ పేరుతో ద్వేషం, మతత్వమనే వైరస్‌లను బిజెపి వ్యాపింపజేస్తుందని ఆమె విమర్శించారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా మాట్లాడుతూ..లాక్ డౌన్ కారణంగా దేశంలో 12 కోట్ల మంది నిరుద్యోగులయ్యారని ఆమె చెప్పారు. రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రతి కుటుంబానికి రూ. 7,500 ఆర్థిక సాయాన్ని కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా టెస్టులను కూడా మన దేశంలో చాలా తక్కువగా నిర్వహిస్తున్నారని… నాసిరకమైన పీపీఈ కిట్లను వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/