రాజకీయాల్లో ఉండబోను అంటూ సోము వీర్రాజు సంచలన ప్రకటన
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన ప్రకటన చేశారు. 2024 తర్వాత తాను రాజకీయాలలో ఉండబోను అంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. పోలవరం, ఇతర అంశాలపై ఏపీ సర్కార్ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన ఆయన.. ఈ సందర్భంగా రాజకీయా జీవితంఫై మాట్లాడుతూ..‘‘42 సంవత్సరాలగా రాజకీయాలలో ఉన్నాను. ఏపీలో బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను.. నేను పదవులు ఆశించి పని చేయలేదు. నాకు సీఎం అవ్వాలని లేదు’’ అన్నారు.
‘‘2014 ఎన్నికల సమయంలోనే నాకు రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారు. కానీ నేను ఇష్టపడకపోతే ఆకుల సత్యనారాయణకి అవకాశం దక్కింది. నేను బీజేపీ కార్యకర్తని… పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్నాను. డిసెంబర్ మూడున ‘దివ్య కాశీ…భవ్య కాశీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ కాశీ క్షేత్రం పూర్తిగా రూపురేఖలు మార్చారు…కాశీ క్షేత్రం అబివృద్ది కార్యక్రమాలని ప్రధాని మోదీ ప్రారంభించే సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని అన్ని మండలాలలో స్క్రీన్ ల ద్వారా ప్రదర్సిస్తాం’’ అని తెలిపారు.