ఉపరాష్ట్రపతిని కలిసిన సోము వీర్రాజు

మర్యాదపూర్వకంగా వెంకయ్యనాయుడు గారిని కలుసుకున్నానన్న వీర్రాజు

somu-veerraju-meets-venkaiah-naidu

న్యూఢిల్లీ: సోము వీర్రాజు ఏపి బిజెపి అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మొదటిసారిగా ఢిల్లీకి వెళ్లారు. ఈనేపథ్యంలో ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ప్రకటించిన తర్వాత ఉపరాష్ట్రపతి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. మరోవైపు బిజెపి జాతీయ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ ను కూడా సోము వీర్రాజు కలిశారు. ఈ భేటీకి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ, ‘రామ్ మాధవ్ ను ఎప్పుడు కలిసినా ఒక గొప్ప వ్యక్తితో నాకు మంచి అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంటుంది. దేశం, పార్టీ గురించి ఆయనకు ఉన్న విజన్ నాకు స్ఫూర్తిదాయకం’ అని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/