కొందరు నేతలు పాదయాత్రలు చేసి రోడ్లు అరిగిపోయేలా చేశారు

ఇసుక, చెరువులోని మట్టి కూడా అమ్ముకుంటున్నారు..సోము వీర్రాజు

అమరావతి : ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తోలు మందం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇసుక, చెరువులో మట్టిని కూడా అమ్ముకుని సంపాదించుకుంటోందని అన్నారు. రాష్ట్రాన్ని బుద్ధి లేని నాయకత్వం పాలిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొందరు నేతలు పాదయాత్రలు చేసి రోడ్లన్నీ అరిగిపోయేలా చేశారని ఎద్దేవా చేశారు.

విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస నిర్వాసితుల గ్రామాల్లో ఈరోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో కూడా ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారని చెప్పారు. మడ్డువలస రిజర్వాయర్ నిర్వాసితులతో పాటు అన్ని నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/