వైఎస్ఆర్సిపి, టిడిపి నేతలు బిజెపిలో చేరుందుకు సిద్ధం ఉన్నారు
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తారని వివరణ
అమరావతి: ఏపి బిజెపి చీఫ్ సోము వీర్రాజు రాజకీయ ఎత్తుగడల్లో పదును పెంచారు. వైఎస్ఆర్సిపి, టిడిపి నేతలు నిరంతరం తమతో టచ్ లో ఉంటున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ వరకు వైఎస్ఆర్సిపి, టిడిపి నేతలు తమతో చర్చలు జరుపుతున్నారని, బిజెపిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని వివరించారు. త్వరలోనే ఏపీ బిజెపిలోకి వలసలు ఊపందుకుంటాయని అన్నారు. మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు బిజెపి వైపు చూస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు వైఎస్ఆర్సిపి, టిడిపిలకు సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని, బీసీని సీఎం చేసే సత్తా వైఎస్ఆర్సిపి, టిడిపిలకు ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో బీసీలు బిజెపితో ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలన్నది బిజెపి అజెండా అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/