సమాజం మెచ్చిన సారథులు

జీవన వికాసం

Society appreciated women
Society appreciated women

20వ శతాబ్దంలో మహిళలు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. బ్యాంకింగ్‌, ఆర్థికం, సాంకేతికం, వైద్యం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా తమ సంస్థను లాభాల బాటలో నడిపిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్న వారిలో మహిళలే ముందుంటారు.

మనదేశంలో అలా వివిధ సంస్థలకు నాయకత్వం చాటుతున్న కొందరు శక్తిమంతమైన మహిళా సారథులు.. ఆరంభంలో చిన్న సంస్థతో ప్రారంభించి, ఆ తర్వాత దేశమే గర్వించేలా వీరు సాధిస్తున్న విజయాలు నేటి మహిళలకు ఆదర్శం. వారి విజయాలను తెలుసుకుందాం.

Society appreciated women

నివృతిరాయ్:

ఇంటెల్‌ ఇండియా కంట్రీహెడ్‌గా, ఇంటెల్‌ డేటాసెంటర్‌ గ్రూప్‌వైస్‌ ప్రెసిడెంట్‌గానూ వ్యవహరిస్తున్నా రు. ఓరెగన్‌ స్టేట్‌ యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌లో పీజీ చేసిన నివృతి తక్కువ జీతంతో ఓ మామూలు ఉద్యోగినిగా ఇంటెల్‌లో చేరారు.

ఇంటెల్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం ఏర్పాటులో, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, 5జీ, క్లౌడ్‌ టెక్నాలజీని విస్తృతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.

భారత బృందంతో కలిసి సెన్సర్‌హబ్‌ని అందుబాటులోకి తెచ్చిన నివృతి 2019 ఫార్చ్యూన్‌ విడుదల చేసిన అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

పద్మజ చుండూరు:

ఇండియన్‌ బ్యాంక్‌ సిఇవోగా నియమితురాలైన తెలుగింటి ఆడపడుచు. 1984లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పద్మజ..ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో పిజి పూర్తిచేశారు.

మూడుదశాబ్దాలకు పైగానే బ్యాంకింగ్‌ రంగంలో అపారమైన ఉద్యోగానుభవం ఉన్న పద్మజ భారత్‌లోనే కాదు అమెరికాలోనూ పలు పదవ్ఞల్ని అధిరోహించారు.

యుఎస్‌ఐబిసి బ్యాంకింగ్‌ కమిటీలో సభ్యురాలిగా, న్యూయార్క్‌ ఇంటర్నేషనల్‌ బ్యాంకర్స్‌ అసోసి యేషన్‌ బోర్డ్‌కి ట్రస్టీ సభ్యురాలిగానూ చేశారు. విదేశాల్లో పనిచేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిందనీ, అదే ఉన్నతస్థాయికి చేరుకునేలా చేసిందనీ చెబుతారు పద్మజ.

వాణీకోలా:

ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఆర్థికంగా సాయం చేసే కలారీ క్యాపిటల్‌కి మేనేజింగ్‌ డైరెక్టర్‌. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన వాణీకోలా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఎస్సీ, అరిజోనా స్టేట్‌ యూనిర్సిటీ నుంచి పిజీ పట్టా అందుకున్నారు.

ఇరవై రెండేళ్లు సిలికాన్‌వ్యాలీలో పనిచేసిన వాణి 2006లో భారత్‌కు తిరిగొచ్చాక కొన్నాళ్లు న్యూఎంటర్‌ప్రైజ్‌ అసోసియేట్స్‌లో పార్ట్‌నర్‌గా చేరారు.

ఆరేళ్ల తర్వాత ఆ సంస్థనే కలారీ క్యాపిటల్‌గా మార్చారు. అప్పటికి ఆ సంస్థ నిధులు వెయ్యికోట్ల రూపాయలు మాత్రమే.

ఆమె నాయకత్వంలో 2017 నాటికి అవి 4600 కోట్ల రూపాయలకు పెరిగాయి. క్యూర్‌ఫిట్‌, స్నాప్‌డీల్‌, మింత్రా, అర్బన్‌లాడర్‌ వంటి సంస్థలు కలారీ క్యాపిటల్‌ సహకారంతో ఎదిగినవే.

Society appreciated women

సునీతారెడ్డి:

అపోలో హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సునీతను ఆ సంస్థ వ్యవస్థాపకులు ప్రతాప్‌రెడ్డి అపోలో లక్ష్మిగా సంబోధిస్తారు.

ఫైనాన్స్‌హెడ్‌గా అపోలోలో కొన్నాళ్లు పనిచేసిన తరువాత ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలోని అపోలో రీచ్‌ హాస్పిటల్స్‌ మోడల్‌ నిర్వాహకురాలిగానూ వ్యవహరించారు. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ కంపెనీల్లోనూ కీలకబాధ్యతలు చేపట్టారు.

తన కృషితో సంస్థను లాభాలబాట పట్టించిన సునీత ఫార్చ్యూన్‌ ఇండియా విడుదల చేసిన మోస్ట్‌పవర్‌ పుల్‌ విమెన్‌ జాబితాలో కిందటేడాది చోటు దక్కించు కున్నారు. ఈ రోజుల్లో వ్యాపారం అంటే కేవలం లాభాలు మాత్రమే కాదు.

సామాజిక సేవ కూడా అందులో భాగమే నని చెబుతూ ఎంతోమంది పేదల కు తమ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్య సాయం అందేలా చేశారు.

కిరణ్‌ మజుందార్‌ షా:

బయోకాన్‌ వ్యవస్థాపకు రాలిగానే కాదు, భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగానూ గుర్తింపు ఈమె సొంతం.

పైనాన్షియల్‌ టైమ్స్‌, ఫోర్బ్స్‌ జాబితా ఇలా వివిధ సంస్థలు విడుదల చేసే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రతిఏటా చోటు దక్కించుకోవడంలో ఆమెకు ఆమే సాటి.

మహా రాష్ట్రలో పుట్టిపెరిగిన కిరణ్‌ తండ్రి సలహాతో మెల్‌బోర్న్‌ లోని బాలారాట్‌ యూనివర్సిటీ నుంచి మాల్టింగ్‌ అండ్‌ బ్రూయింగ్‌ చదివారు.

వివిధ సంస్థల్లో ఇచ్చేశాక బయో కాన్‌ ఇండియాను తన ఇంటి గ్యారేజీలో ప్రారంభించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/sports/