తుర్కియే, సిరియా భూకంప.. 41వేలకు చేరిన మృతుల సంఖ్య

Smell of dead all over: Turkey-Syria quake toll touches 41,000, voices still being heard from under rubble

అంకారః తుర్కియే, సిరియా సరిహద్దుల్లో గతవారం సంభవించిన భారీ భూకంపంలో మృత్యువిలయం కొనసాగుతోంది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య 41వేలకు చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

మరోవైపు భూకంపం సంభవించి తొమ్మిది రోజుల తర్వాత కూడా శిథిలాల కింద నుంచి ప్రజల స్వరాలు వినిపిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. నీరు, ఆహారం లేక కొందరు శిథిలాల కిందే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు పేర్కొన్నాయి. వారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసేందుకు గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు శ్రమిస్తున్నట్లు తెలిపాయి.