స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 245 మార్కెట్లోకి విడుదల
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా తన ఆక్టావియా మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ ఆక్టావియా ఆర్ఎస్ 245 ను గురువారం నాడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.35.99 లక్షలు (ఎక్స్షోరూమ్). మార్చి 1వ తేదీ నుంచి దీనికి ఆన్లైన్ బుకింగ్స్ను కంపెనీ ప్రారంభించనుంది. రూ.లక్ష చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 200 కార్లను మాత్రమే విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/