ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Six killed in fire accident in Uttar Pradesh

లక్నోః ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిరోజాబాద్‌లోని ఓ ఫర్నీచర్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే అదే బిల్డింగ్‌ మొదటి అంతస్థులో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. మంటలు ఫస్ట్‌ఫ్లోర్‌కు వ్యాపించడంతో నిద్రలో ఉన్నవారు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు.

మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వృద్ధుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు. 18 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశామని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, అగ్నిప్రమాద ఘటనపై సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు ఒక్కొక్కరి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వారి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/