నేడు విదేశాల నుండి రానున్న ఆరు విమానాలు

300 మంది ప్రయాణికులతో లండన్ నుంచి బెంగళూరు చేరిక

Six flights to land today bringing back stranded Indians

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్‌డైన్‌ నేపథ్యలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్’ మిషన్ ద్వారా మన దేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఓ ప్రత్యేక విమానం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకుంది. మూడు వందల మంది ప్రయాణికులతో లండన్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఢిల్లీ మీదుగా నేటి తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకుంది. కాగా మరో ఆరు ప్రత్యేక విమానాలు ఈరోజు రానున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ కు, అబుదాబి నుంచి హైదరాబాద్ కు, కౌలాలంపూర్ నుంచి చెన్నైకు, ఢాకా నుంచి ముంబైకు, దుబాయ్ నుంచి కొచ్చికి, బహ్రెయిన్ నుంచి కోజికోడ్ కు ఈ ప్రత్యేక విమానాలు చేరుకోనున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/