క్వార్టర్స్‌లో తైజు యింగ్‌ చేతిలో సింధు ఓటమి

pv sindhu
pv sindhu

కౌలాలంపూర్‌: మలేషియా మాస్టర్స్‌ సూపర్‌ బ్యాడ్మిండన్‌ 500 టోర్ని నుంచి భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ తైజు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో 16-21, 16-21 తేడాతో ఓటమిపాలైంది. మొదటి గేమ్‌లో సింధు తొలుత ఆధిక్యం సాధించినా తర్వాత దాన్ని కాపాడుకోలేకపోయింది. 15-15తో స్కోరు సమంగా ఉన్న దశలో తైజు వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో కూడా తైజునే ఆధిపత్యం చెలాయించింది. ఒక దశలో 11-20తో ఉన్న సింధుకి ఘోర పరభావం తప్పదని భావించారంతా..కానీ సింధు ఆఖర్లో చెలరేగి 16-20తో నిలిచింది. అయితే గేమ్‌ విజయానికి ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ దూరంలోనే ఉండటంతో సింధుకి ఓటమి తప్పలేదు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/