యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల కాలంలో హీరోల తాలూకా బర్త్ డే రోజున వారు నటించిన చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. పవన్ కల్యాణ్​ ‘ఖుషి’, ‘జల్సా’, మహేశ్ బాబు ‘పోకిరి’, వెంకటేశ్ ‘నారప్ప’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’, రామ్ చరణ్ ఆరెంజ్ తదితర చిత్రాలు రీ–రిలీజ్ అయి అభిమానులను అలరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన సెన్సేషనల్ మూవీ ‘ఆది’ రీ రిలీజ్ కు సిద్ధమైంది.

ఎన్టీఆర్‌కి మాస్ ఇమేజ్‌ తెచ్చిన ‘ఆది’ చిత్రంతో పాటు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సెన్షేషనల్ బ్లాక్‌బస్టర్ ‘సింహాద్రి’. 4K (అల్ట్రా HD), డాల్బీ అట్మాస్ 5.1తో ‘సింహాద్రి’ థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలను ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ‘ఆది’ చిత్రాన్ని ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే మే 20న విడుదల చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అలాగే ‘సింహాద్రి’ చిత్రానికి సంబంధించి ఏప్రిల్ 9వ తేదీన అధికారికంగా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30 వ చిత్రంతో బిజీ గా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.