మహిళలకు అన్నింటిలో సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు

సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా మహిళను నియమించి సీఎం జగన్‌ రికార్డు సృష్టించారు

avanthi srinivas
avanthi srinivas

విశాఖపట్టణం: మహిళల పట్ల అభిమానంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వారికి అన్నింటిలో వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం సింహాచలం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సిరిపురపు ఆశాకుమారి, వారణాసి దినేష్‌, రొంగలి పోతన్న, సూరిశెట్టి సూరిబాబు, కృష్ణారెడ్డి, చంద్రకళ, రాగాల నరసింహనాయుడు, దాడి దేవి, గరుడా మాధవి, పద్మ ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ..సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా మహిళను నియమించి జగన్‌మోహన్‌ రెడ్డి రికార్డు సృష్టించారని అన్నారు. చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు మహిళలకు పదవులు ఇస్తే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అశోక్‌ గజపతిరాజు అంటే తమకు గౌరవం ఉందని..అతని కుటుంబానికి చెందిన మహిళను చైర్మన్‌గా నియమించడం సంతోషకరమన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com