‘శ్యామ్‌ సింగ రాయ్‌’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ ఖరారు..

వరుస పరాజయాలతో సతమతవుతున్న నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, సెబాస్టియన్ మడోన్నా హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపించాడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి పాన్ ఇండియా గా నిర్మించారు.

భారీ అంచల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద చక్కటి విజయం సాధించింది. కేవలం టాక్ మాత్రమే కాదు కలెక్షన్లు కూడా భారీగా సాధించి ..లాభాలు అందుకుంది. ఇక ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాను నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేయగా.. జనవరి 21 వ తేదీన అంటే శుక్రవారం రోజు నుంచి ఈ మూవీ నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇక ఈ ప్రకటన తో న్యాచురల్‌ స్టార్‌ నాని ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.