శ్యామ్ సింగ రాయ్ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్

నాని , సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ జంటగా రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ ​సింగ రాయ్. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈనెల 24న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర రైట్స్ దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 8 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమా హిందీ రైట్స్ ను ప్ర‌ముఖ బాలీవుడ్ సంస్థ B4U రూ. 10 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో ఓటీటీ, హింది రైట్స్ తోనే ఈ సినిమాకు 60 శాతం రిక‌వ‌రీ వ‌చ్చింద‌ని అంటున్నారు.

ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమా ఫై అమాంతం అంచనాలు పెంచేసింది. ‘స్త్రీ ఎవడికీ దాసి కాదు. ఆఖరికి ఆ దేవుడికి కూడా. ఖబద్దార్’ అంటూ బెంగాలీలో నాని చెప్పిన డైలాగ్.. ఆకట్టుకుంటోంది. ”అడిగే అండ లేదు..కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసని.. అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే..” అంటూ వచ్చిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

1970 లనాటి కలకత్తా నేపథ్యాన్ని ప్రస్తుత కాలానికి లింక్ చేస్తూ ‘శ్యామ్ సింగ రాయ్’ ని తెరకెక్కిస్తున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమాలో నాని.. రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. రెండు పాత్రలు కూడా ప్రజల కోసం ఫైట్ చేస్తున్నట్లు టీజర్ లో చూపించారు. శ్యామ్ సింగరాయ్ కు జోడిగా సాయి పల్లవి కనిపిస్తుంటే.. వాసు ప్రేయసిగా కృతి శెట్టి లిప్ లాక్ చేస్తూ కనిపించింది. మరి నాని రెండు పాత్రలకు మధ్య సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.