శృతి హాసన్ కాళ్లు కందిపోయాయి..ఎందుకని..?

వీర సింహ రెడ్డి , వాల్తేర్ వీరయ్య చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న శృతి హాసన్..తాజాగా తన కాళ్లు కందిపోయేలా ఉన్న పిక్ పోస్ట్ చేసి అభిమానులను టెన్షన్ కు గురిచేసింది. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా గ్రాండ్ గా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ అనిపించింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తో ఆమె జతకమే మారిపోయింది. ఈ మూవీ తర్వాత అమ్మడు వెనుకకు చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస హిట్ల తో దూసుకెళ్తుంది. రీసెంట్ గా సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య లో చిరంజీవి కి జోడిగా , వీర సింహ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ కు జోడిగా నటించింది. ఈ రెండు చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ విజయాలతో శృతి మళ్లీ సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టింది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పిక్ లో రెండు కాళ్లను చూపించింది. తెల్లగా మెరిసిపోతున్న ఆ కాళ్లపై మోకాళ్ల వద్ద చర్మం ఎర్రగా మారిపోయి కనిపించింది. మోకాళ్ల వద్ద ఇంత ఎర్రగా మారడం అంటే ఏదైనా కష్టమైన పని చేసిందని అర్థమవుతోంది. ఈ స్టోరీపై రాసిన టెక్స్ట్ లో ‘గుడ్ డే ఎట్ వర్క్’ అంటూ రాసుకొచ్చింది శృతి హాసన్. కాళ్లు కందిపోయేలా శృతి పడిన ఆ కష్టం ఏమిటో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న శృతి హాసన్.. ఏదో సినిమా కోసం కష్టపడినట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ లో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించబోతుంది.