శ్రద్ధా శ్రీనాథ్ ‘కలియుగం’

హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో

Shraddha Srinath

హీరో నాని నటించిన ‘జెర్సీ’  చిత్రంలో తన స్పెల్-బైండింగ్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్, ప్రస్తుతం  “కలియుగం” అనే తెలుగు, తమిళ  సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటివరకూ  భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది.

అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.

అయితే శ్రద్దా శ్రీనాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ “నేను కథ విన్న వెంటనే ఈ సినిమా చేయాలనీ  ,అంత గొప్ప కథ ఇది అని తెలిపారు.

ఇలాంటి పాత్ర పోషించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని తెలిపారు.

అంతేకాక ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక ఫ్రెష్ కథతో ఒక గొప్ప సినిమా చూశాం అనే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.  

 2021 జనవరి లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను “ఆర్ కె ఇంటెర్నేషనల్” బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు.

ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

మిగతా నటీనటులు టెక్నీకల్ టీమ్ విషయాలు అతి త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/