మహేష్ ఇంట్లో కరోనా కలకలం

దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత భారీగా పెరుగుతుంది. మొన్నటి వరకు పెద్దగా కేసులు బయటపడలేదు కానీ..గత 20 రోజులుగా భారీ ఎత్తున కరోనా కేసులు బయటపడుతున్నాయి. కరోనా తో పాటు ఓమిక్రాన్ కేసులు సైతం పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఇక చిత్ర సీమా విషయానికి వస్తే రీసెంట్ గా పలువురు కరోనా బారినపడగా..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం రేపింది.

మహేష్ బాబు వదిన , నమ్రతా అక్క అయినా శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోండి మరియు అన్ని నియమాలను అనుసరించండి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది.

శిల్పా కూడా ఒకనాటి బాలీవుడ్ నటి. “హమ్”, “ఖుదా గవా” మరియు “ఆంఖేన్” వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించిన శిల్పా ప్రస్తుతం దుబాయ్ లో ఉంటుంది. శిల్పాకు నమ్రత, మహేష్ లకు మధ్య ఎంతటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నమ్రత- మహేష్ ఏ పార్టీ చేసుకున్నా శిల్పా లేకుండా ఉండదు.