శిఖర్ ధావన్ దంపతులు విడాకులు తీసుకున్నారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ వార్తే వైరల్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ధావన్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పష్టం చేయడం తో ఈ వార్త గురించి అంత మాట్లాడుకుంటున్నారు. అయేషా ముఖర్జీ తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టింది. విడాకులకు సంబంధించిన అనేక అంశాలు అందులో పేర్కొంది. ఈ పోస్ట్ ఫై శిఖర్ ధావన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కానీ, అయేషా పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు డిసైడ్ అవుతున్నారు. అంతే కాదు శిఖర్ ధావన్ ఫోటోలను తొలగించింది ఆయేషా ముఖర్జీ. తన సెకండ్ మ్యారేజ్ ఇక నిలవక పోవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తూ చాలా భావోద్వేగానికి గురైంది.

2012 లో శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ వివాహం చేసుకున్నారు. ధావన్, అయేషాకు జోరావర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. శిఖర్ కంటే అయేషా 10 సంవత్సరాలు పెద్దది. ధావన్ పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ తరువాత 2014లో అయేషా, ధావన్ దంపతులకు కుమార్ జోరావర్ జన్మించాడు. ఇక గత ఏడాది నుండే వీరిద్దరూ విడిపోతారనే వార్తలు మీడియా లో ప్రచారం అవుతూ వచ్చినప్పటికీ..ఎవరు కూడా స్పందించలేదు. ఇక ఇప్పుడు అయేషా ముఖర్జీ సోషల్ మీడియా ద్వారా విడిపోయామంటూ చెప్పకనే చెప్పేసరికి అంత ఫిక్స్ అయ్యారు.