10 వికెట్ల తేడాతో విండీస్పై రెండో టీ20లో విజయం

సెయింట్ లూసియా: వన్డే సిరీస్ను గెలిచిన ఊపు మీద ఉన్న భారత మహిళలు..టీ20ల్లో కూడా జోరును కొనసాగిస్తున్నారు. వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి టీ20గెలిచిన రోజు వ్యవధిలోనే భారత జట్టు మరోక విజయాన్ని అందుకుంది. రెండో టీ20లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో 2-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను 20 ఓవర్లలో 103 పరుగులకే కట్టడి చేసిన భారత మహిళలు..బ్యాటింగ్లో సత్తాచాటారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (69 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లు), స్మృతీ మంధాన (30 నాటౌట్:28 బంతుల్లో 4 ఫోర్లు)లు రాణించడంతో భారత్ ఘన విజయం సాధించింది. ఆది నుంచి దూకుడుగా ఆదుతూ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో భారత్ 10.3 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా గెలుపును అందుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు సాధించి విండీస్ పతనాన్ని శాసించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/