నిజ జీవితంలో కూడా రోజా అద్భుతంగా నటిస్తుంది
సీఆర్డీఏ పరిధిలో ఉన్నా భూములను ఎలా సర్వే చేస్తారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టిడిపి నాయకురాలు నన్నపనేని రాజకుమారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బర్దస్త్లో రోజా మహానటని.. నిజజీవితంలోనూ చాలా అద్భుతంగా నటిస్తోందంటూ ఎద్దేవా చేశారు. జై అమరావతి అనాలని రైతులు అడ్డుకుంటే.. రోజా డీజీపీకి ఫోన్ చేసిందనని విరుచుకుపడ్డారు. జై అమరావతి అనడానికి ఇబ్బందేంటని ధ్వజమెత్తారు నన్నపనేని. సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూములను ఎలా సర్వే చేస్తారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. సర్వేను అడ్డుకున్నందుకుక 426 మంది రైతులపై కేసులు పెట్టారన్నారని.. కేసులు పెట్టాల్సింది రైతులపై కాదు.. దొంగదారిన వస్తున్న అధికారులపై పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు వస్తే ఏ సంతకాలూ సూచించారు నన్నపనేని రాజకుమారి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/