తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ మర్రి శశిధర్ ఎద్దేవా

శుక్రవారం బిజెపి పార్టీ లో చేరిన మర్రి శశిధర్ కాంగ్రెస్ ఫై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణ లో కాంగ్రెస్ పని అయిపోయిందని , టిఆర్ఎస్ పార్టీని ఎదురుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని, 8 ఏళ్లుగా తెలంగాణలో అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతుందని.. తాను ఎంతో ఆలోచించిన తర్వాతే బిజెపిలో చేరాను అని అన్నారు.

శుక్రవారం ఢిల్లీలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ కండువా కప్పి మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలోకి శర్భానంద సోనోవాల్ ఆహ్వానించారు. శశిధర్ వెంట బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ కూడా ఉన్నారు. వాస్తవానికి శశిధర్ రెడ్డి జెపి నడ్డా సమక్షంలో బిజెపి పార్టీలో చేరాల్సి ఉంది. కానీ ఆయన సమయానికి అందుబాటులో లేకపోవడంతో సోనావాల్ సమక్షంలో శశిధర్ రెడ్డి బిజెపి పార్టీలో చేరారు.

తెలంగాణ ప్రజలు మంచి సర్కారును కోరుకున్నరు.. కానీ అది రాలేదని శశిధర్ రెడ్డి అన్నారు. మొత్తం ప్రపంచంలో ఇంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్​ ఫెయిల్​ అయిందన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని … తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ఇలాంటి ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు.