నేడు లోటస్ పాండ్ లో దీక్ష చేపట్టనున్న షర్మిల

పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేయనున్న షర్మిల

Sharmila will take protest in Lotus Pond today

హైదరాబాద్‌ః తన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంపై వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల అసహనం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో పాదయాత్రకు వరంగల్ పోలీస్ కమిషనర్ అనుమతిని నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె మధ్యాహ్నం 12 గంటలకు లోటస్ పాండ్ లో దీక్ష చేపట్టనున్నారు. పాదయాత్రకు అనుమతించని పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేయనున్నారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతించకపోవడంపై ఆమె మండిపడుతున్నారు. పాదయాత్ర సందర్భంగా షర్మిల వాహనానికి టిఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్రను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. షర్మిల పాదయాత్ర కొనసాగితే ఇలాంటి ఘటనలే మళ్లీ పునరావృతమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/