రేపు తాడిపత్రిలో షర్మిల నిరాహార దీక్ష

నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల
హాజరు కానున్న నిరుద్యోగులు, విద్యార్థులు

హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తొలి నుంచి నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తుతున్న షర్మిల రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ‘నిరుద్యోగ నిరాహారదీక్ష’ చేపడతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. షర్మిల చేపట్టనున్న ఈ నిరాహార దీక్షకు ఆ పార్టీ నేతలతోపాటు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆయన తెలిపారు. కాగా, షర్మిల మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రకటించి జెండాను ఆవిష్కరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/