యాసంగి వడ్ల మీద రాజకీయాలు వ‌ద్దు: ష‌ర్మిల

ఇంకెంత మంది చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు?.. వైఎస్

హైదరాబాద్ : ధాన్యం విక్ర‌యించ‌డానికి వెళ్లి కొనుగోలు కేంద్రాల వ‌ద్దే ప‌లువురు రైతులు త‌నువు చాలించారంటూ తెలంగాణ ప్ర‌భుత్వంపై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే, యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారు. మీ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయి. ఇవాళ మరో ఇద్దరు..ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ గారు?’ అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

‘ఇంకెంత మందిని బలితీసుకొంటారు? రైతులను కోటీశ్వర్లను చేశాం, కార్లల్లో తిరుగుతున్నారు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. ఒక్కసారి ఫామ్ హౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుంది.. రైతులు కోటీశ్వరులు కావడం కాదు మీరు ఉరి కొయ్యకు ఉరి వేస్తున్నారని. మీరు పంట కొనక కాటికి పంపుతున్నారు’ అని ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/