ఎమ్మెల్సీ కవిత ఫై YS షర్మిల ఫైర్

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై YS షర్మిల నిప్పులు చెరిగారు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ చేసావా అని ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్ ను పక్కదారి పట్టించేందుకు సీఎం బిడ్డ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అంటూ కొత్తరాగం అందుకోవడం విడ్డురంగా ఉందని , బంగారం పోయిందని దొంగలే ధర్నా చేసినట్టుందని చురకలు అంటించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మీరు, మహిళలకు 33% సీట్లు ఎందుకు కేటాయించలేదు? అని మండిపడ్డారు.

మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్ కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలు అని ఆగ్రహించారు. మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయడంలో కేసీఆర్ కు అడ్డంకేంటని ప్రశ్నించారు. కేబినెట్ లో పట్టుమని ఇద్దరే మంత్రులు ఉన్నారని..ఇదేనా మహిళలపై మీకున్న ప్రేమ అని ఎద్దేవా చేశారు.