రాహుల్ యాత్రకు స్వాగతం పలకనున్న శ‌ర‌ద్ ప‌వార్

Sharad Pawar will welcome Rahul Yatra

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ..ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ మొదటివారంలో రాహుల్ మహారాష్ట్రలో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో రాహుల్ కు ఘన స్వాగతం పలకబోతున్నారు ఎన్‌సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్.

సెప్టెంబ‌ర్ 7న త‌మిళ‌నాడులోని కన్యాకుమారిలో రాహుల్ ప్రారంభించిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం బీజేపీ పాలిత క‌ర్నాట‌క‌లోని చిత్ర‌దుర్గ మీదుగా సాగుతోంది. రాహుల్ పాద‌యాత్ర న‌వంబ‌ర్ తొలివారంలో మ‌హారాష్ట్ర‌లోకి ప్ర‌వేశించ‌నుంది. భార‌త్ జోడో యాత్ర మ‌హారాష్ట్ర‌లో ఎనిమిది జిల్లాల ప‌రిధిలోని 380 కిలోమీట‌ర్ల మీదుగా సాగుతుంద‌ని సీఎల్పీ నేత‌, మాజీ మంత్రి బాలాసాహెబ్ థొర‌ట్ తెలిపారు. ఇక ఈనెల 23 నుండి తెలంగాణలో రాహుల్ పాదయాత్ర మొదలవుతుంది. దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో రాహుల్‌ పాదయాత్రకు బ్రేక్ పడింది. తిరిగి 26 నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు.