కుప్పకూలిన విమానం..18 మంది మృతి

 military plane crash
military plane crash

ఖార్తూమ్‌: సూడాన్‌లోని వెస్ట్ దర్ఫూర్‌లో శుక్రవారం ఉదయం మిలటరీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఇజనైనా నుంచి టెకాఫ్ ఐనా ఐదు నిమిషాలకే విమానం కూలిపోయింది. చనిపోయిన వారిలో ముగ్గురు న్యాయమూర్తులు, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది పౌరులున్నట్టు సమాచారం. సూడాన్ సరిహద్దులో ఇథనిక్ గ్రూప్‌ల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో గాయపడిన వారికి వైద్య సేవలందించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈవిమానం ప్రమాదానికి గల కారణుల ఇంకా తెలియాల్సి ఉంది. కాగా సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జెనైనా ప్రదేశంలో గత కొన్ని రోజులుగా కొన్ని వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వారంలో దాదాపు 48 మంది మృతిచెందినట్లు సమాచారం.
2003 నుంచి సూడాన్‌లో జరిగిన ఘర్షణలలో 3 లక్షల మంది చనిపోగా 2.5 మిలియన్ల మంది ఇతర దేశాలకు వలసపోయారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/