మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం..7 మంది మృతి
యావత్మాల్: మహారాష్ట్రలోని యవత్మాల్లో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్వ్యాన్ వంతెనపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయాల పాలయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వ్యానులో కొంతమంది తమ బంధువు అస్తికల నిమజ్జనానికి కోటేశ్వర్ మందిరానికి వెళ్లి, జోడ్మోహా తిరిగివస్తున్నారు. ఇంతలో వ్యాను అదుపుతప్పి ఒక చెట్టును ఢీకొని కిందకు పడిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపినదాని ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు అక్కడికకక్కడే మృతి చెందగా, ఇద్దరు చికిత్సపొందుతూ కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/