నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఏప్రిల్ 8 వరకూ సమావేశాలు
న్యూఢిల్లీ: నేటి నుంచి బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 8 వరకూ సమావేశాలు సాగనుండగా, పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఫైనాన్స్ బిల్లుతో పాటు పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (సవరణ) బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లులు ఈ సమావేశాల్లో కీలకం కానున్నాయి. ఇదే సమయంలో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు కూడా సభ ముందుకు రానుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/