భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభమయ్యే సరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 483 పాయింట్లు నష్టపోయి 40,687 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 121 పాయింట్లు పతనమై 11,958 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.88 గా కొనసాగుతుంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/