లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: వరుసగా మూడు సెషన్లలో నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడి 41,386కి పెరిగింది. నిఫ్టీ 73 పాయింట్లు పుంజుకుని 12,180 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.28 వద్ద కొనసాగుతోంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh