నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. ప్రారంభంలో కొంత లాభాలతో మొదలైనప్పటికీ ట్రేడింగ్ ముగిసేసరికి నష్టాల్లోకి జారుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 214 పాయింట్లు దిగజారి 38,409 వద్ద ముగించింది. నిఫ్టీ సూచీ 52 పాయింట్లు నష్టపోయి 11,251 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.36 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana