మళ్లీ నష్టాలతో మొదలైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమయ్యే సరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 265 పాయింట్లు నష్టపోయి 40,015 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచీ 80 పాయింట్లు పతనమై 11,717 వద్ద ట్రేడవుతుంది. యుఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.77 వద్ద కొనసాగుతోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/