భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

మంబయి: ప్రధాని ఆర్థిక వ్యవస్థను గట్టేక్కించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 797 పాయింట్లు లాభపడి 32,168 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 221 పాయింట్లు ఎగబాకి 9,417 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.80 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/