మూడో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు క్షణాల వ్యవధిలోనే కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 568 పాయింట్లు నష్టపోయి 55,107కి పడిపోయింది. నిఫ్టీ 153 పాయింట్లు కోల్పోయి 16,416 వద్ద స్థిరపడింది.  డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.76వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/