భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,181 పాయింట్లు పెరిగి 61,795కి చేరుకుంది. నిఫ్టీ 322 పాయింట్లు లాభపడి 18,349కి ఎగబాకింది. ఐటీ సూచీ 3.70 శాతం, టెక్ సూచీ 3.21 శాతం పెరిగాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.80.75 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/