నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ: మూడు రోజులుగా నష్టాల్లో నమోదవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా దే దిశగా సాగుతున్నాయి. ఉదయం 9.35గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 311 పాయింట్లు నష్టపోయి 36,161 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 10,654 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయి 72.01 వద్ద ట్రేడవుతోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/