స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ప్రారంభంలో కొంత లాభాలతో మొదలైనప్పటికీ ట్రేడింగ్ ముగిసేసరికి నష్టాలను చవిచూశాయి. సాయంత్రం ట్రేడింగ్ ముగిసేసరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 82 పాయింట్లు కోల్పోయి 40,281 వద్ద ముగించింది. నిఫ్టీ సూచీ 31 పాయింట్లు పతనమై 11,797 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.85 గా ఉంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/