యుద్ధం ప్రభావం..మార్కెట్లలో బ్లడ్ బాత్.. 2,702 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

ముంబయి: యుద్ధం ప్రభావంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్లను దాటింది. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మన దేశీయ మార్కెట్లు కూడా కుప్పకూలిపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 2,702 పాయింట్లు పతనమయ్యాయి. నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయి 16,247కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు భారీగా నష్టపోయాయి. రియాల్టీ సూచీ 7.59 శాతం ఆటో, టెలికాం సూచీలు 6 శాతానికి పైగా కోల్పోయాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/