క‌రోనాతో సీనియర్ నేత అజిత్ సింగ్ మృతి

పలు పార్టీల నేతలు సంతాపం

Ajith Singh-File
Ajith Singh-File

రాష్ట్రీయ‌ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) పార్టీ అధినేత చౌదరి అజిత్ సింగ్ (82) క‌రోనాతో మృతి చెందారు. అజిత్ సింగ్ కు గత నెల 22న కరోనా సోకింది. గురుగ్రామ్‌ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆయన మృతి చెందారు. . అజిత్ మృతి పట్ల పలు పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్యూ, పీలోని బాగ్‌ పత్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. గతంలో పౌరవిమానయానశాఖ మంత్రిగానూ పనిచేశారు. అజిత్ సింగ్ తండ్రి చరణ్ సింగ్..1979-80లో ఆరు నెలల పాటు భారత ప్రధానిగా సేవంలందించారు. పశ్చిమ యూపీలోని జాట్ సామాజికవర్గంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి బలమైన పట్టుంది. కాంగ్రెస్, బీజేపీలో పొత్తుపెట్టుకొని కేంద్రంలో పలు మార్లు కేంద్రమంత్రిగానూ అజిత్ సింగ్ పనిచేశారు. మొదట విపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత పీవీ నరసింహారావు కేబినెట్‌ లో పనిచేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/