నిత్యవసరాలు పంపిణీ చేస్తున్న సీతక్క

ఏటూరునాగారం మండలంలో పంపిణి

seethakka giving vigitables to village people
seethakka giving vigitables to village people

ములుగు: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క ఆదివాసిలకు అండగా నిలబడుతున్నారు. దేశంలో లాక్‌డౌన్‌ విధించడంల వల్ల ఆదివాసీలకు నిత్యవసరాలు అందకపోవడంతో నేరుగా ఎమ్మేల్యేనే ఆయా గ్రామాల్లో నిత్యవసరాలను పంచుతున్నారు. గత కొద్ది రోజులుగా ములుగు నియోజకవర్గంలోని గ్రామాలలో పర్యటిస్తూ అందరికి నిత్యవసరాలను అందిస్తున్నారు. తాజాగా ఏటూరూనాగారం మండలంలోని దొడ్లగుంపు, దొడ్ల కొత్తురు, షాపెల్లి గ్రామాలలోని 450 కుటుంబాలకు నిత్యవసరాలను అందించారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ స్వీయ నిర్బందంలో ఉండాలని సూచించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/