బ్రిడ్జ్ కింద ఇరుక్కున్నఎయిర్ ఇండియా విమానం

గతేడాదే సేవల నుంచి ఆ విమానాన్ని తప్పించామన్న ఎయిర్ ఇండియా

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానం ఒకటి బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. సేవల నుంచి తప్పించిన విమానాన్ని ఎయిర్ ఇండియా స్క్రాప్ కింద అమ్మేసింది. దీనిని తరలిస్తున్న సమయంలో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వంతెన కింద ఇరుక్కుపోయింది.

విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ విమానాన్ని గతేడాదే సేవల నుంచి తప్పించినట్టు చెప్పారు. విమానాన్ని తుక్కు కింద కొనుక్కున్న వారు శనివారం దాని తరలింపును చేపట్టినట్టు పేర్కొన్నారు. కాబట్టి ఈ విమానంతో ఎయిర్ ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/