ఇంగ్లండ్లో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు
ఇంగ్లండ్: ఇంగ్లండ్లో ఈరోజు నుండి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనన్నాయి. మార్చి నెలలో విధించిన లాక్డౌన్ వల్ల విద్యాసంస్థలు అన్నీ బంద్ అయ్యాయి. నియంత్రిత పద్ధతిలో స్కూళ్లను తెరవనున్నట్లు ఆ దేశ విద్యాశాఖ వెల్లడించింది. పిల్లలు, టీచర్లు, సిబ్బంది మధ్య డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. సోషల్ డిస్టాన్స్ను కూడా అమలు చేయనున్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో ఫేస్ మాస్క్లు తప్పనిసరి. కొత్త విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం అవుతున్నట్లు బ్రిటన్ విద్యాశాఖ మంత్రి గెవిన్ విలియమ్సన్ తెలిపారు. ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కోసం స్కూళ్ లను రీఓపెన్ చేస్తున్నట్లు చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/